Green India Challenge | “మనుషుల్లో సమానత్వం – ప్రకృతి సమతూల్యత” రెండు ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్( Ambedkar ) భావించారు. అందుకే తాను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే వారు ఒక మొక్కను నాటిన తర్వాతే తనను కలిసేందుకు రావాలని అంబేద్కర్ ఆనాడే పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల వారి దూరదృష్టికి ఇదొక మచ్చుతునక.
మనం మన రాజ్యాంగాన్ని ఎలాగైతే మార్గదర్శకంగా భావిస్తున్నామో, అలాగే అంబేద్కర్ చెప్పిన మొక్కలను నాటాలనే స్ఫూర్తిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా కొనసాగించాలని పిలుపునిస్తున్నామని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్( MP Santosh Kumar ) పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున, అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని.. ప్రగతిశీలతకు నిలువెత్తు నిదర్శనమైన బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. ఈ సందర్భంలో ప్రతీ ఒక్కరు వారి ఆశయాన్ని కొనసాగిస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఒక్కో మొక్కను నాటాలని కోరుతున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక కార్టూనిస్ట్ మృత్యుంజయ వేసిన కార్టూన్ను ఎంపీ సంతోష్ కుమార్ ట్యాగ్ చేశారు.
The vision of Dr. Bhimrao Ramji Ambedkar ji, the cheif architect of our constitution, with regard to not only equality among humans, but care and concern towards mother nature was amazing, as he wanted his visitors to see him only after planting a sapling.
As we are treating our… pic.twitter.com/dXiV1cE2UN
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 12, 2023