Banswada | బాన్సువాడ, అక్టోబర్ 29: బాన్సువాడ నియోజకవర్గం తొమ్మిదేండ్లలో అనూహ్య ప్రగతి సాధించింది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు పంచారు. రూ.650 కోట్ల నిధులతో పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామి గా నిలిపారు. యువతకు కోసం 2 కోట్లతో మినీస్టేడియాన్ని నిర్మించారు. కల్కి చెరువును 7 కోట్లతో మినీ ట్యాంక్ బండ్గా మార్చారు. మున్సిపాలిటీ కొత్త భవనాన్ని 2 కోట్లతో, రెవె న్యూ సముదాయాన్ని 1.50 కోట్లతో, సమీకృ త మార్కెట్ దుకాణ సముదాయం 2 కోట్ల తో, కల్కి చెరువు తీరాన 4 కోట్లతో ఆక్సిజన్ పార్కు, చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేశారు. బాన్సువాడలో 100 కోట్లతో ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించారు. కోటగిరిలోని పీహెచ్సీని స్పీకర్ పోచారం.. 13 కోట్లతో 50 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేశారు. చదువుకునేందుకు సౌకర్యాలు లేక వెనుకబడిన బాన్సువాడ.. నేడు ఎడ్యుకేషన్ హబ్గా మారింది. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను నిజాంసాగర్కు తరలించడంతో ఏడా దంతా ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తున్నది. మంజీర పరీవాహక ప్రాంతాల్లో చెక్ డ్యాము లు నిర్మించారు. కట్టల బలోపేతం, ప్రధాన కాలువ ఆధునీకరణ, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల మరమ్మతులతో ఆయకట్టు చివరిదాకా రెండు పంటలకూ నీరు అందుతున్నది. నియోజకవర్గంలోని మెట్ట భూములకు నీరందించేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తలపెట్టిన చందూర్ ఎత్తిపోతల, సిద్దాపూర్ జలాశయం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే నాన్ కమాండ్ ఏరియా అంతా పచ్చటి పైర్లతో సస్యశ్యామలం అవుతుంది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు వచ్చింది.
ఉమ్మడి పాలనలో కంకరతేలి దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లు.. సాగునీరు అందక బీళ్లుగా భూములు.. నాణ్యమైన విద్య.. వైద్యం అందని ద్రాక్షే.. ఇదీ నాటి బాన్సువాడ నియోజకవర్గ దుస్థితి.. గడిచిన తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో అభివృద్ధికి అడ్డగా మారింది బాన్సువాడ. రూ.10 వేల కోట్ల నిధులతో అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. పోచారం చొరవతో ప్రతి పల్లె రోడ్డు.. ప్రతి గుంటకు సాగునీరు.. ప్రతి ఇంటికీ పథకం.. ఇలా అభివృద్ధి, సంక్షేమంలో నియోజకవర్గం పరుగులు పెడుతున్నది.
బాన్సుబాడ నియోజవర్గానికి నిధుల కేటాయింపు ఇలా..