జయశంకర్ భూపాలపల్లి : వైద్యులు కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు. ఘన్పూర్ మండలం, చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కరోనా టెస్ట్ కోసం వచ్చిన ప్రజలను, కరోనా వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తెలియచేశారు. సమయపాలన పాటించని వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపత్కాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
సెల్ఫీ దిగుతూ.. వాగులో పడి యువకుడు మృతి
రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి
ఇక ప్రాణవాయువుకు ఇబ్బందుల్లేవు : మంత్రి పువ్వాడ