మేడ్చల్, జనవరి 25: సీఎంఆర్ వైద్య కళాశాలలో ఓ అరుదైన శస్త్ర చికి త్స నిర్వహించిన వైద్యులు ఓ 70 ఏండ్ల వృద్ధురాలికి ప్రాణదానం చేశారు. దాదాపు రూ.8 లక్షల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా అందజేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి చెందిన సాలెమ్మ (70) చాలా రోజులుగా శ్వాసకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు ఎడమవైపుకు ఉండాల్సిన గుండె కుడివైపు ఉన్నట్టు గుర్తింసీఎంఆర్ వైద్యులు గుర్తించారు.
పేగులు పైకి రావడంతో తీవ్ర ఆయాసంతో బాధపడుతున్నట్టు గుర్తించారు. డాక్టర్ అరుణ్కుమార్ కనాల్ ఆధ్వర్యంలో వైద్య బృందం సాలెమ్మకు డయాఫ్రమెటిక్ ప్లికేషన్ అనే శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పైకి వచ్చిన పేగులను సరి చేశారు. వైద్య బృందం, చైర్మన్ చామకూర గోపాల్రెడ్డి, డీన్ డాక్టర్ రమణ, డైరెక్టర్ అలీబేగ్లకు బాధితురాలు సాలెమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.