మహబూబ్నగర్ అర్బన్, మే 6: ‘రేవంత్రెడ్డి లక్కీ డిప్ ముఖ్యమంత్రి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. బూతులు మాట్లాడే సీఎం మన జిల్లా వాసి అంటే సిగ్గుగా ఉంది. మోదీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే’ అంటూ బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు.
సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దమ్ముంటే పాలమూరుకు జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చేలా అనుమతులు ఇప్పించని సవాల్ విసిరారు.