మహబూబ్నగర్ టౌన్, జనవరి 24 : 2019 సార్వత్రిక ఎన్నికల్లో రూ.15 కోట్లు ఇస్తేనే ఎంపీగా పోటీ చేస్తా’నని డీకే అరుణ పీసీసీ అంతర్గత సమావేశంలో డిమాండ్ చేశారని సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్రెడ్డి తెలిపారు. బుధవారం మహబూబ్నగర్లోని జేజేఆర్ ఫంక్షన్హాలులో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన మాటలు అసత్యమైతే రాముడి గుడిలో ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఆమె ఏదైనా రామాలయానికి వచ్చి రూ.15 కోట్లు అడగలేదని చెబితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంట’ అని చెప్పారు.