సిరిసిల్ల రూరల్, జూలై 22: మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో 120 మంది సీనియర్ సిటిజన్లకు ట్రస్మా ఆధ్వర్యంలో జియో స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం గ్రామంలోని కమ్యూనిటీ హాలులో బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, ఎంపీపీ మానస, జక్కుల నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.