నిజామాబాద్ : అర్హులైన ప్రతి పేదవారికి ఆహార భద్రత కార్డులను అందజేస్తామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం, బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులకు ఆదివారం నూతన ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హల్లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడారు. ఆకలితో ఏ ఒక్కరూ ఉండకూడదు. పేదల కడుపు మూడు పూటలా నిండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసిచారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పెన్షన్లు అందజేస్తున్నారని గుర్తు చేశారు. బాన్సువాడ పట్టణంలో నిర్మించిన మాతా శిశు దవాఖానలో గర్భిణులకు ఆధునిక సేవలు అందుతున్నాయని తెలిపారు. అదే విధంగా బాన్సువాడకు నూతనంగా నర్సింగ్ కళాశాల మంజూరు అయిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఛత్తీస్గఢ్ పోలీసులకు చిక్కిన టైగర్ హుంగా
పేదల కడుపు నింపేందుకే కొత్త రేషన్ కార్డులు
Tokyo Olympics: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల నిషియా
గంభీర్కు చుక్కెదురు.. స్టే ఇవ్వలేమన్న సుప్రీం