నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రభుత్వ దవాఖానలో అన్ని వసతులతో వైద్య సౌకర్యాలు అందజేస్తారని ఆయన తెలిపారు. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినవారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
మొత్తం రాష్ట్రంలోనే నల్లగొండ నియోజకవర్గం అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు పొందినట్టు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ చైర్మన్ బొర్ర సుధాకర్ పట్టణ పార్టీ అధ్యక్షులు పిల్లి రామరాజుయాదవ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనాథ పిల్లలకు అండగా ఉంటాం: మంత్రి ఐకే రెడ్డి
సీఎం కేసీఆర్ నిర్ణయంతో వైద్య రంగం బలోపేతం
కరోనా ఉగ్రరూపం.. తల్లడిల్లుతున్న యూపీ పల్లెలు
కరోనా పోవాలని ముత్నుర్లో మహిళల పూజలు