TS Schools | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం 202324 విద్యాసంవత్సరంలో పుస్తకాల పంపిణీకి ముందస్తు చర్యలు చేపట్టింది. పాఠశాలలు ప్రారంభమయ్యే తొలిరోజు జూన్ 12న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడానికి సిద్ధమైంది. రాష్ట్రంలోని 28.77 లక్షల మంది విద్యార్థులకు 1.63 కోట్ల పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. ఇప్పటివరకు 52.10 లక్షల పుస్తకాలు, అంటే 33 శాతం ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేర్చారు. మే నెలాఖరు వరకు పుస్తకాలు 100 శాతం జిల్లాలకు చేర్చేలా లక్ష్యంగా పెట్టుకొన్నారు. నిరుడు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పేపర్ ముడిసరుకు లభించక పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. కానీ, ఈ ఏడాది మాత్రం ముందస్తుగానే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
విద్యార్థులు 28,77,675
అవసరమయ్యే పుస్తకాలు 1,63,78,607
మిగులు నిల్వ (గతేడాదివి) 6,30,337
ముద్రించాల్సినవి 1,57,48,270
జిల్లాలకు చేర్చినవి 52,10,226 (33%)
ఇంకా చేర్చాల్సినవి 1,05, 38,044