హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ప్రచారంలో పాల్గొన్నారంటూ నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టులోని ఇద్దరు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లపై పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఉన్న జీ శ్యాంరావు, పీ సామయ్య ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారన్న ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సెక్షన్ 120, 188 కింద బోధన్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే సుజన ఇటీవల తీర్పు చెప్పారు. నిందితులపై సంబంధిత అధికారి ఫిర్యాదు చేయలేదని, వారికి ఐపీసీ సెక్షన్ 120, 188 వర్తించబోవని స్పష్టం చేస్తూ.. పోలీసుల ఎఫ్ఐఆర్ను కొట్టివేశారు.