కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఎత్తులను చిత్తు చేసిన ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
అవిశ్వాసానికి హాజరుకాని కౌన్సిలర్లు
పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
కోదాడలో మున్సిపల్ చైర్పర్సన్పై నెగ్గిన అవిశ్వాసం
Suryapeta | సూర్యాపేట : బీఆర్ఎస్ పార్టీకి చెందిన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్పై విపక్షాలు శనివారం ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ముఖ్యమంత్రి చాంబర్తోపాటు ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ, బీఎస్పీతో కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టి ఆ పదవిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని వేసిన ఎత్తులను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి చిత్తు చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీలో 48 మంది కౌన్సిలర్లు ఉండగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ కలిసి ఆవిశ్వాసానికి కావాల్సిన 32 మంది కౌన్సిలర్లను జమ చేసి నోటీసు ఇచ్చారు. సదరు కౌన్సిలర్లను నల్లగొండ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పర్యవేక్షణలో హైదరాబాద్, గోవాతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో 17 రోజుల పాటు క్యాంపుల్లో ఉంచారు. ఇందుకోసం రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే జగదీశ్రెడ్డితో కలిపి బీఆర్ఎస్కు 16 మంది ఉన్నారు. విపక్ష క్యాంపులో ఉన్న ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు రెండు రోజుల ముందు తాము అవిశ్వాసానికి దూరంగా ఉంటామని ప్రకటించి, ఆ తర్వాత కనిపించకుండా పోయారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. ఆ ముగ్గురికి హైదరాబాద్ సీఎం చాంబర్ కేంద్రంగా ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసినట్లు సమాచారం. అందుకే తాము అవిశ్వాసానాకి దూరంగా ఉంటామని బీఆర్ఎస్ కౌన్సిలర్లను నమ్మించి మోసగించేందుకు కుట్ర చేసినట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెబుతున్నారు.
సూర్యాపేట మున్సిపల్ పాలిటీ జనరల్ స్థానం అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ మహిళకు చైర్పర్సన్గా అవకాశం కల్పించింది. ఆమెపై అవిశ్వాసం పెట్టి పదవి నుంచి దించేందుకు కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కుట్రలు చేయగా దానిని వమ్ము చేసేందుకు ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి చక్రం తిప్పారు. శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్తోపాటు వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు. కాంగ్రెస్తోపాటు బీజేపీ, బీఎస్పీకి చెందిన 32 మంది కౌన్సిలర్లలో ఒక కౌన్సిలర్ తీర్మానానికి మద్దతు తెలిపేందుకు విముఖత వ్యక్తం చేసి బీఆర్ఎస్ శిబిరంలోకి వచ్చినట్లు తెలిసింది. దాంతో మిగిలిన 31 మంది హాజరైనప్పటికీ ఫలితం ఉండదని భావించి వారు కూడా రాలేదు. దాంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్గా పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్గా పుట్ట కిశోర్ కొనసాగనున్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు అధికారులు ప్రకటించగానే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 35 మంది కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా, 34 మంది ఉన్నారు. ఇందులో 33 మంది హాజరు కాగా తీర్మానానికి 29 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. నలుగురు వ్యతిరేకించారు. దాంతో అవిశ్వాసం నెగ్గినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.