హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ టెన్త్ ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ తెలిపారు. 498 మార్కులతో తమ విద్యార్థి ఆలిండియా టాపర్గా నిలిచినట్టు పేర్కొన్నారు. 497 మార్కులను ఇద్దరు, 495 మార్కులు ఆపైన ఐదుగురు, 490 మార్కులు ఆపైన 46 మంది, 480 మార్కులు ఆపైన 442 మంది, 470 మార్కులు ఆపైన 1,136 మంది సాధించినట్టు ఆమె వివరించారు.
ఓవరాల్ శ్రీచైతన్యలో 89 శాతం బ్రాంచీలు 100 శాతం పాస్ సాధించాయని తెలిపారు. ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 99.2 శాతంగా ఉన్నదని వెల్లడించారు. 496 మంది విద్యార్థులు సబ్జెక్టులవారీగా 100/100 మార్కులు సాధించినట్టు తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థల వ్యవస్థాప చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు అభినందించారు.