హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ)/వ్యవసాయ యూనివర్సిటీ: వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించొద్దని, భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవో నంబర్-55ను ప్రభుత్వం వెంట నే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాలయ ఝాన్సీ డిమాండ్ చేశారు. సోమవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ చాంబర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఝూన్సీ మాట్లాడుతూ.. రైతులు పండించే పంటకు లాభం చేకూర్చేందు, నూతన వంగడాల కోసం పరిశోధనకు ఎంతగానో వ్యవసాయరంగానికి మేలు చేకూర్చే భూములను హైకోర్టుకు కేటాయించవద్దని కోరారు. 35 ఏండ్లుగా వర్సిటీలో మెడిసినల్ ప్లాంట్స్, కూరగాయల విత్తనాలు లాంటి అనేక వంగడాలపై ఎన్నో రకాల పరిశోధనలు జరిగాయని గుర్తుచేశారు.
ప్రస్తుతం ఆగ్రో బయోడైవర్సిటీ కొనసాగుతున్న పార్కులో రాష్ట్ర హైకోర్టు కోసం దాదాపు 100 ఎకరాల భూమిని తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయించడం తగదని పేర్కొన్నారు. వ్యవసాయరంగాన్ని తుంగలో తొక్కి, గ్రామీణ ప్రాంత యువతను విద్యాకు దూరం చేయడానికి ప్రభుత్వం కుట్రపన్నుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సేట్ హాస్టల్స్ కన్వీనర్ జీవన్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా సీఎం స్పందించి వర్సిటీ భూములను వెనక్కి ఇచ్చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని లేవనెత్తుతామని హెచ్చరించారు. ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థును పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనాథ్, మనీషా, పృథ్వీరాజ్, సూర్యప్రకాశ్, మహేశ్, రాజు, సాయిరాం, హరిప్రసాద్ పాల్గొన్నారు.