హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : విధుల్లో ఉన్న పోలీసులు, ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్రెడ్డి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు పోలీస్ సిబ్బందిని ఇష్టమొచ్చినట్టు దూషించడంపై డీజీపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ మేరకు పోలీసుల్లో ధైర్యం నింపేందుకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు, కార్యకర్తలు చట్టానికి అతీతులు కారని, ఇష్టారీతిన వ్యవహరిస్తే చర్యలు తప్పవనిఆ తేల్చి చెప్పారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ‘దేశం కోసం మధ్యవర్తిత్వం’ కార్యక్రమంలో భాగంగా నిరుడు జూలై నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 7,168 కేసులు మధ్యవర్తిత్వానికి సిఫారు చేశారని, వాటిలో 617 కేసులు పరిష్కారమయ్యాయని అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్ పంచాక్షరి వెల్లడించారు.