హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ప్రధాని పర్యటనకు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం ప్రధాని హనుమకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో గురువారం వరంగల్ సీపీ, సీనియర్ పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ సమీక్షించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రధాని పర్యటనలో ఇబ్బందులు తలెత్తకుండా రెవెన్యూ, రైల్వే, రోడ్లు భవనాలు తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వరంగల్లో హెలిప్యాడ్ నుంచి ప్రధాని ప్రయాణించే మార్గాల్లో, ఆయన పాల్గొనే బహిరంగ సభ వేదిక వద్ద పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.