DGP Anjani Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్టోబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ సన్నద్ధతపై శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్ సీనియర్ పోలీస్ అధికారులు, యూనిట్ అధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో అడిషనల్ డీజీలు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సంజయ్ కుమార్ జైన్లతోపాటు ఐజీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరుగబోయే ఎన్నికలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలు వివరించారు.