చేర్యాల /సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకొని ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు తీర్చుకున్నారు.
కొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కూకట్పల్లిలో రేవ్ పార్టీ భగ్నం..44 మంది యువకులు అరెస్ట్
Crime news | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని దగ్ధమైన ఇసుక లారీ
పూలే ఆశయాలను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి