Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుసగా ఆదివారం సెలవుదినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ప్రత్యేకదర్శనానికి గంట సమయం పడుతుండగా.. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. గర్భాలయంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించారు. కొండపైన కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడి కనిపించింది. అలాగే పాత లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి సైతం భక్తులు తరలివచ్చారు. ఆలయ నిత్యపూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.