Komuravelli | సిద్ధిపేటలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో 8వ ఆదివారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. దాదాపు 50వేల మందికిపైగా తరలివచ్చి, మల్లన్నను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే కోనేరులో స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టువద్ద ముడుపులు చెల్లించుకున్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి అభిషేకం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఏ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.