యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta )శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Lakshminarasimha swamy) వారి దివ్య క్షేత్రంలో భక్తులు(Devotees) పోటెత్తారు(Flocked). ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. మాడ వీధులు క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్ ప్రసాద విక్రశాల ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొన్నది.
పార్కింగ్లో వాహనాలు అధికం కావడంతో పోలీస్ సిబ్బంది కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు. స్వామివారి ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని భక్తులు వెల్లడించారు.