వేములవాడ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం శ్రావణమాసం సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. వేకువ జాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి తమ కోడెమొక్కు తీర్చుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో గల కల్యాణకట్టలో భక్తులు తలనీలాల సమర్పించారు.
నిలువెత్తు బెల్లాన్ని భక్తులకు పంచిపెట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులు గర్భగుడిలో నిర్వహించుకునే ఆర్థిక సేవలైన అభిషేక పూజలు, అన్న పూజలు, ఆకుల పూజలను ఆలయ అధికారులు రద్దు చేశారు. దీంతో భక్తులు లఘు దర్శనం చేసుకున్నారు.
ఆలయ కళాభవన్లో భక్తులు కల్యాణాల మొక్కులు, సత్యనారాయణ వ్రతాలు, చండీ హోమాలు ఘనంగా నిర్వహించారు .రాజన్న అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, బద్ది పోచమ్మ దేవాలయాల్లో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తరించారు.
రాజన్నను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని రాజన్నకు సుమారు రూ.24 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.