చేర్యాల, మార్చి 3 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో(Devotees) కిక్కిరిసిపోయింది. 7వ వారానికి కరీంనగర్, వరంగల్ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమారు 25వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి( Mallanna temple) తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
ట్రాక్టర్లు,ఆటోలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్రంలోని పార్కింగ్ స్ధలాలు నిండిపోయాయి. మల్లన్న దర్శనంతో భక్తులు పులకరించిపోయారు. శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాక ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. భక్తులు కోనేటిలో పవిత్ర స్నానాలు అచరించి క్యూలైన్ల ద్వారా స్వామి వారి ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.