వేములవాడ : మహాశివరాత్రి సమీపిస్తున్న సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ వేకువ జామునుండే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి రాజన్నకు ప్రీతి మొక్కైన కోడెమొక్కు తీర్చుకున్నారు. భక్తులు ఆలయం ముందు భాగంలో గల కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో 2 గంటల పాటు నిలబడి దర్శించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సుమారు 20 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఆలయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.