శ్రీశైలం: శ్రీశైలంలో దర్శనానికి వచ్చిన భక్తుడు ఆదివారం మృతిచెందాడు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్ల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుండగా వల్లిక అశోక్ అనే భక్తుడు హఠాత్తుగా కిందపడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే అశోక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడిని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి వాసిగా గుర్తించారు.