బాన్సువాడ (కామారెడ్డి) : ప్రజల కోసం చేపట్టే అభివృద్ధి పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) అన్నారు. కామారెడ్డి(Kamaredddy) జిల్లా బాన్సువాడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి బుధవారం పర్యటించారు. టీచర్స్ కాలనీలో
మురికి కాలువ, ఎల్లయ్య చెరువు కట్ట, సంగమేశ్వర కాలనీలను అనుసంధానం చేస్తూ చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను(Drainage works) పరిశీలించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎల్లయ్య చెరువు చుట్టూ, చెరువు నుంచి తాడ్కోల్ రోడ్డు వరకు సీసీగా మారుస్తున్నట్లు తెలిపారు. వారాంతపు సంతకు వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ. కోటితో ఈ పనులను చేపట్టినట్లు చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో నాణ్యతతో( quality works) పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ధోబీఘాట్ నిర్మాణం కోసం స్థలాన్ని ఆయన పరిశీలించారు.