వికారాబాద్ : సీఎం కేసీఆర్ చొరవతోనే మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామానికి ప్రధాన సమస్య అయిన రోడ్డు సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నిధులు రాగానే ప్రాధాన్యత క్రమంలో పనులు చేసి సమస్యలు పరిష్కారం చేస్తామని వివరించారు.
గత ప్రభుత్వాల హయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోక కుంటుపడిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధికి జనాభాను బట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు నేరుగా గ్రామ పంచాయతీకే అందిస్తున్నారన్నారు. ప్రధాన సమస్యలను గుర్తించి గ్రామ సంఘం ద్వారా తీర్మానం చేసి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ నీరు ఇంటింటికి సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలను సరి చేసి ప్రమాదాలు జరుగకముందే సమస్య పరిష్కారం కావాలని విద్యుత్ అధికారులు సూచించారు.
కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదిని, స్థానిక సర్పంచ్ రాములునాయక్, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కమాల్రెడ్డి, ఎంపీడీవో సుభాషిణి, మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన