BRS | జనగామ జిల్లాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. దేవరుప్పల మండల కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కత్తుల సోమిరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు యువ నాయకులు కత్తుల ప్రదీప్ రెడ్డి, ఆకుల పృథ్వీ కూడా పార్టీలో చేరారు. వీరికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి ఎర్రబెల్లి నివాసంలో ఈ చేరిక జరిగింది.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం, పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు ఆకర్షితలై బీఆర్ఎస్లో చేరుతున్నామని ఈ సందర్భంగా కత్తుల సోమిరెడ్డి తెలిపారు. తమ ప్రాంతంలో ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో ఆయన్ను అధిక మెజారిటీతో గెలిపించేందుకు తన వంతుగా కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, పార్టీలో కొత్తగా చేరిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు.