ఖమ్మం : మహిళల అభివృద్ధిలో(Women development) తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. ఆదివారం ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది భోజనశాల, లేడీస్ లాంజ్ స్ట్రీ టీ క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు వడ్డీలేని రుణాలు అందజేసి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. వారికి రూ.25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అలాగే ఆర్టీసీలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నామన్నారు.