హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని ఖమ్మం, వరంగల్ వంటి మారెట్లో మిర్చి ధరలు ఊపందుకున్నాయి. ఖమ్మంలో ముఖ్యంగా తేజా రకం మిర్చికి పెరుగుతున్న డిమాండ్ వల్ల ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రోజువారీగా 19,000 నుంచి 20,000 క్వింటాళ్ల వరకు మిర్చి మారెట్లోకి వచ్చేస్తోంది. గత నెల వరకు కేవలం రూ.11,000 నుంచి రూ.12,000 వరకు పలికిన ధరలు.. ప్రస్తుతం గరిష్టంగా రూ.13,500 వరకు చేరుకున్నాయి.మోడల్ ధరలు కూడా రూ.11,500 నుంచి రూ.12,000 మధ్య ఉన్నాయి.వరంగల్ మారెట్కి రోజుకు సుమారు 6,000 క్వింటాళ్ల మిర్చి చేరుకుంటోంది. అకడ కూడా ధరలు రూ.12,000 నుంచి రూ.13,000 మధ్య ఉన్నాయి. వండర్ హాట్ రకం మిర్చి 2,800 క్వింటాళ్లకు పైగా మారెట్కు చేరుకుంటున్న నేపథ్యంలో.. ధరలు రూ.14,000 నుంచి రూ.15,500 మధ్య ఉండడం గమనార్హం. అలాగే యుఎస్ 341 రకం మిర్చికి సుమారు 6,000 క్వింటాళ్ల డిమాండ్ ఉండగా.. ధరలు రూ.12,000 వరకు పెరిగాయి. హైదరాబాద్ మలక్ పేట్ మారెట్కి మాత్రం తకువ మొత్తంలోనే మిర్చి వస్తోంది. సుమారు 1,000 క్వింటాళ్లలోపు చేరుతోంది.
కొన్ని నెలలుగా నిలకడగా కొనసాగిన మిర్చి ధరలు తాజాగా పెరుగుతుండటంతో రైతులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మారెట్లో పెరుగుతున్న డిమాండ్, దేశీయంగా కూడా కొనుగోళ్ల పెరుగుదల కారణంగా మారెట్లో అత్యధికంగా నమోదు అవుతోంది. నాణ్యమైన మిర్చికి కొనుగోలు దారులు ఆసక్తి చూపిస్తుండటంతో.. క్విం టాల్కు సగటున రూ.300 నుంచి రూ.500 వరకు ధర పెరిగే అవకాశముంది. మిర్చి ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణంగా ఎగుమతులు సజావుగా సాగుతుండటమేనని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. దేశీయంగా కూడా ఆహార ప్రాసెసింగ్ కంపెనీలు అధిక మొత్తంలో మిర్చిని కొనుగోలు చేస్తుండటంతో మారెట్లో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మిర్చి రైతులు ఈ కొత్త ధరలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. పండించిన మిర్చికి తగిన ధర లభిస్తుండటంతో వచ్చే నెలల్లో కూడా మారెట్ ధరలు మెరుగవుతాయనే విశ్వాసం రైతుల్లో నెలకొంది. అయితే.. వచ్చే రోజుల్లో వాతావరణ పరిస్థితులు, దిగుబడి స్థాయిపై ఆధారపడి ధరలు ఎలా మారుతాయో చూడాలి. మారె ట్ నిపుణుల అంచనాల ప్రకారం.. మరికొన్ని వారాల పాటు ధరలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.