తిరుమలాయపాలెం, మే 24 : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో శనివారం పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరసన సెగ తగిలింది. పాతర్లపాడులో ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై గ్రామస్థులు పొంగులేటిని నిలదీశారు.
ధనవంతులు, అనర్హులకే ఇందిరమ్మ కమిటీ వారు ఇళ్లు మంజూరు చేయించారని, పూర్తిస్థాయిలో విచారణ జరిపి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి స్పందిస్తూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరపాలని తహసీల్దార్ విల్సన్ను ఆదేశించారు. రెండో విడతలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.