పెద్దపల్లి : దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు 11వ వేతన కమిటీ అమలు చేయడం కోసం కమిటీ వేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పదో వేతన ఒప్పందం ముగియకముందే 11వ వేతన ఒప్పందానికి సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడంపై కార్మికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కోలిండియాతో పాటు సింగరేణి కార్మికులకు పదో వేతన ఒప్పందం 1.07.2016 నుంచి 30.06.2021 వరకు అమలులో ఉంది. ఈ గడువు ముగియక ముందే స్టాండర్డెజేషన్ కమిటీ సమావేశంలో జాతీయ కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు కోలిండియా యాజమాన్యం కోల్ మినిస్ట్రీతో మాట్లాడింది.
ఈ క్రమంలో 11వ వేతన కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డీపీఈ) గైడ్లైన్స్కు లోబడి చర్చలు జరుపుకోవాలని కేంద్రం పేర్కొంది. గతంలో డీపీఈ గైడ్లైన్స్కు భిన్నంగా బొగ్గు గని కార్మికులు పోరాడి అదనపు వేతనం, ప్రయోజనాలు పొంది ఉన్నారు. 11వ వేతన ఒప్పంద కమిటీలో భాగంగా డీపీఈ గైడ్లైన్స్ అమలు చేయనున్నారు. ఆ ప్రకారం సూచించిన మేరకు వేతనాలు, ప్రయోజనాలు పొందే అవకాశముంటుంది.
10వ వేతన ఒప్పందంలో 1.7.2016 నుంచి వేతనాల పెరుగుదల అమలు కావాల్సి ఉండగా, అక్టోబర్ 2017 నుంచి కొత్త వేతనాలు అమలు చేశారు. 11వ వేతన ఒప్పందంలో ముందుగానే కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినప్పటికీ వేజ్బోర్డు సమావేశాలు ప్రారంభం కావడం, పలు దఫాల చర్చలు జరిగిన అనంతరం వేతన కమిటీ ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. మరో ఏడాది తర్వాతనే 11వ వేతన ఒప్పందంకు సంబంధించి అంగీకారం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆక్సిజన్కు కొరత లేదు : మంత్రి జగదీష్ రెడ్డి
విషాదం : చెరువులోపడి యువకుడి మృతి
పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకే మేయర్ ఎన్నిక
కరోనా నియంత్రణపై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష
కరోనా బాధితులకు డ్రైఫ్రూట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే