లక్నో: ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఔరాయా జిల్లాలో అంజలి (20) అనే యువతికి కరెంట్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తీసుకొచ్చారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన యువతి కొంత సేపటికి మరణించింది. అంబులెన్స్ లేకపోవడంతో మృతురాలి అన్న ఆమె మృతదేహాన్ని బైక్పై చున్నీతో వీపుకు కట్టుకొని తరలించాల్సి వచ్చింది.