ములుగు : జిల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్డంతో కూతరు మృతి చెందదగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన సమ్మక్క, సారక్క తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో ఓటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఖాతా రమేష్ ఏడాది వయసు గల తన కూతరును బైక్పై తీసుకొని వెళ్తుండగా వారి బైక్ను స్కూలు బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాప అక్కడికక్కడే మృతి చెందగా రమేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.