హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. రేవంత్రెడ్డి తన భాష మార్చుకోవాలని, కేసీఆర్పై మరోసారి అభ్యంతరకరంగా మాట్లాడితే ప్రజలే నాలుక చీరేస్తారని హెచ్చరించారు. మోదీ, రేవంత్ బందాన్ని కాంగ్రెస్ బయటపెట్టాలని డిమాండ్ చేశా రు. శనివారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నేతలు భిక్షమయ్యగౌడ్, ఎం శ్రీనివాస్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో శ్రవ ణ్ మాట్లాడారు. సీఎం రేవంత్కు అధికార అహంకారం నరనరాన ఎక్కిందని మండిపడ్డారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ను పట్టుకొని ఎవడివిరా? అని రేవంత్ అంటున్నాడని అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి అని కూడా చూడకుం డా.. ఆయన వయసుకు గౌరవం ఇవ్వకుండా రేవంత్రెడ్డి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ తీరు గల్లీ లీడర్కన్నా అధ్వాన్నంగా, చిల్లరగా ఉన్నదని ధ్వజమెత్తారు. బిల్లా, రంగాలకు ప్రతిరూపం రేవంత్ అని అభివర్ణించారు. రాహుల్గాంధీ అయినా రేవంత్ తీ రును మార్చాలని కోరారు. అద్దం ముందు కూర్చొని రేవంత్ ఓ సారి తన ముఖం తాను చూసుకోవాలని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్సోళ్లకు కోపం వస్తే ఐదేండ్లలోపే సీఎంగా రేవంత్ దిగిపోతాడని శ్రవణ్ అన్నారు. ‘కేసీఆర్కు గోరీ కడతావా? ఎందుకు కడతావ్? తెలంగాణ తెచ్చినందుకా? తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసినందుకా?’ అని నిలదీశారు. కేసీఆర్ మీద భాష ఇలాగే కొనసాగితే రేవంత్ నాలుక చీరేదీ తెలంగాణ ప్రజలేనని హెచ్చరించారు. హామీల అమలును ప్రశ్నిస్తే రేవంత్కు అసహనం పొడుచుకొస్తున్నదని మండిపడ్డారు. కేసీఆర్ కన్నా మంచి పాలన అందించడంలో రేవంత్ పోటీపడాలని శ్రవణ్ సూచించారు. కాంగ్రెస్ నేతలవి లఫంగి, బట్టేబాజ్ మాటలు కావా? అని ధ్వజమెత్తారు. హామీల అమలు చేత కాకపోతే కాంగ్రెస్ నేతలు చెంపలు వేసుకోవాలని, తిట్లతో ప్రజల దృష్టిని మళ్లించలేరని పేర్కొన్నారు. మోదీని రేవంత్ కలిశాక కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు వరసగా బయటపడుతున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక, రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ శకటం, అదానీతో ఒప్పందం, తెలంగాణకు ఐపీఎస్ల కేటాయింపు ఇలా అన్ని అంశాలు రేవంత్, మోదీ బంధాన్ని రుజువు చేస్తున్నాయని, తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. రేవంత్కు చేతనైతే కృష్ణా రివర్ బోర్డు విషయంలో కేంద్రం మెడలు వంచేందుకు కృషి చేయాలని శ్రవణ్ సూచించారు.