2014లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈటల రాజేందర్.. నియోజకవర్గ అభివృద్ధిని అసలే పట్టించుకోలేదు. కోడి గుడ్ల వ్యాపారం చేసుకునే ఈయన ఇంత ఎట్ల సంపాదించుండు. ఇప్పుడు దళితుల భూములను ఆక్రమించుకుండు. కోట్ల డబ్బులు సంపాదించుండు. ఈటల చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు. మాగ్రామానికి రోడ్డు వేయలేదు. మాయమాటలను చెప్పిన ఈటల రాజేందర్కు తగిన బుద్ధి చెప్తాం. దళిత బంధు పథకం ప్రవేశపెట్టగానే ఈటలకు కడుపు మండుతోంది. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి.. సన్న వడ్లకు మద్దతు ధర పెంచామని అడుగుతున్నాం. సన్న వడ్లకు రూ. 3500, దొడ్డు వడ్లకు రూ. 2500 ప్రకటన ఇప్పించు. దమ్ముంటే ప్రజల్లోకి వస్తే ఆశీర్వాదిస్తాం. రైతుల పక్షాన నిలబడుతున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు.
– మాడ్గుల ఓదెలు ( రాంపూర్ గ్రామం )