తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన నిధులను సద్విని యోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 4న వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని 76 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు చొప్పున నిధులను ప్రకటించడమేకాక 24గంటల్లోపు అట్టి నిధులను మంజూరు చేశారు. అందులో భాగంగా శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గ్రామంలోని దళిత వాడను సందర్శించారు.
ఇంటింటా తిరుగుతూ.. దళిత కుటుంబాలకు నిధుల వినియోగంపై అవగాహన కల్పించారు. కుటుంబ సభ్యుల వివరాలు ఆర్థిక స్థితిగతులు విద్య, వృత్తి నైపుణ్యత ప్రస్తుతం చేస్తున్న పని తదితర అంశాలను సేక రించారు. నిధులను ఏవిధంగా వినియోగించుకుంటారో తదితర అన్ని అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. దళితబంధు పథకం నిధులను ఎట్టి పరిస్థితుల్లోను సొంతానికి వినియో గించుకోవద్దని సూచించారు.
ఏ రంగాలలో అనుభవం ఉందో ఆయా రంగాల్లో పెట్టుబడి పెట్టి ఆర్థికంగా ఎదుగాలన్నారు. త్వరలోనే దళిత కుటుంబాలతో అవగాహన సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలను వివరిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఫీల్డ్ ఆఫీసర్ మంగరాజ్ శ్రవణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి నర్సింహా చారి తదితరులున్నారు.