ఎల్లారెడ్డిపేట, మార్చి 26: తెలంగాణలో దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ముగ్గురు దళితులను ఓ రైస్మిల్లుకు యజమానులను చేయబోతున్నది. పలువురికి ఉపాధి చూపించేలా యూనిట్ను ఎంచుకోవాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకున్న ముగ్గురు లబ్ధిదారులు కలిసి సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్లో రైస్మిల్లును ఏర్పాటు చేశారు. ఈ మిల్లును మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుధామల్ల రాజేశ్వరి, సుధామల్ల విజయ్కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్య దళితబంధు లబ్ధిదారులు. ఈ ముగ్గురు కలిసి రైస్మిల్లు ఇండస్ట్రీస్ను ప్రారంభించాలని అనుకున్నారు.
2022 మే నెలలో దళితబంధు డబ్బులు రాగానే బ్యాంకు రుణం తీసుకొని నాలుగు టన్నుల సామర్థ్యంతో కూడిన, అధునాతన యంత్ర పరికరాలతో విజయలక్ష్మి ఇండస్ట్రీస్ పేరుమీద రా రైస్మిల్లు ఏర్పాటుకు పనులు మొదలు పెట్టారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పుడున్న డీఎం హరికృష్ణ, డీఎస్వో జితేందర్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్.. రైస్మిల్లులో వరిధాన్యం దింపుకునేందుకు మహేశ్వరి ఇండస్ట్రీస్ పేరుమీద అవకాశం ఇచ్చారు. దీంతో వానాకాలం సీజన్కు సంబంధించి 29,948 క్వింటాళ్ల 40 కిలోల వరిధాన్యాన్ని రైస్మిల్లులో దింపుకున్నారు. ప్రస్తుతం రైస్మిల్లు ఏర్పాటు పనులన్నీ పూర్తి కావడంతో మహేశ్వరి ఇండస్ట్రీస్ను విజయలక్ష్మి ఇండస్ట్రీస్గా పేరు మార్చుకున్నారు. 10 నెలలుగా రైస్మిల్లు నిర్మాణం, యంత్రాల బిగింపు పనులు పూర్తి చేసిన నిర్వాహకులు సోమవారం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.
సీఎం కేసీఆర్ ముందచూపుతో అనేక మంది దళితులు తమ కాళ్ల మీద తాము నిలబడటమే కాదు మరికొందరికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని మం త్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గం పదిర గ్రామంలో ముగ్గురు దళితబంధు లబ్ధిదారులు రాజేశ్వరి, విజయ్ కుమార్, లింగయ్య కలిసి వారికి వచ్చిన దళితబంధు డబ్బును జమ చేసుకొని, మరికొంత మొత్తం బ్యాంకు లోను తీసుకొని టీ-ప్రైడ్ పథకం ద్వారా భారీ గోడౌన్ ఏర్పాటు చేసుకున్నారని ఆదివారం ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం గోడౌన్ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు. ఈ విజయం సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే సాధ్యమైందని చెప్పారు.
కేసీఆర్ దయతోనే దళితుల్లో వెలుగులు నిండుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళితబంధు ఇస్తున్నారు. రోజు పని కోసం వెదుక్కునే మేము.. పదిమందికి పని చూపించే స్థాయికి ఎదుగుతున్నామని గర్వంగా ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ మేలును మేము ఎప్పటికీ మరువము.
-డప్పుల లింగయ్య, లబ్ధిదారు,రంగంపేట, వీర్నపల్లి మండలం
పదేండ్లు బతుకుదెరువు కోసం సౌదీ పోయిన. కష్టాలు పడ్డా. అప్పుదీర్చి వచ్చినంక ఇక్కడెట్ల బతుకుడని రందివడ్డ. ఇద్దరు బిడ్డల్ని సాదుడు, సదివిపిచ్చుడెట్లనని, జీవితమెట్ల గడుస్తదో అనుకున్న. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన దళితబంధు తోటి నాకు రూ.10 లక్షలు వస్తయన్నప్పుడు ధైర్యమనిపిచ్చింది. మా తమ్ముడు సురేందర్ రైస్మిల్ పెడ్దామని జెప్పినంక ఇగ బాధలు తీరినయనిపించింది. కేసీఆర్, కేటీఆర్ మా కుటుంబాన్ని ఆదుకున్నరు.
-సుధామల్ల విజయ్కుమార్, దళితబంధు లబ్ధిదారు, పదిర, ఎల్లారెడ్డిపేట
మాకు లారీ ఉన్న ది. రోజు కిరాయి కో సం ఎదురు చూసే వా ళ్లం. ఇప్పుడు మేమే రైస్మిల్లు పెట్టినమంటే సంతోషంగా ఉన్నది. మాకు దళితబంధు వచ్చిందనగానే నా భర్త సురేందర్, నునే కలిసి ఏదైనా పెద్ద వ్యాపా రం పెట్టాలె అనుకున్నం. కేటీఆర్ సార్ కూ డా నలుగురికి పనిచ్చేటట్టు ఉండాలె అని చెప్పారు. దీంతో రైస్మిల్లు పెట్టినం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతోనే ఇయ్యాల మేము ఈ స్థాయికి వచ్చినం.
-సుధామల్ల రాజేశ్వరి, దళితబంధు లబ్ధిదారు, పదిర, ఎల్లారెడ్డిపేట