“దళితబంధు” డబ్బులతో కొన్న నూతన ట్రాక్టర్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం నారాయణ “దళితబంధు”డబ్బులతో నూతన ట్రాక్టర్ ను కొనుగోలు చేయగా దానిని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ప్రారంభించారు. కోడెం నారాయణకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా గతంలో మూడెకరాల భూమి కూడా పొందాడు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ…”దళితబంధు” కార్యక్రమంతో దళితులు ధనికులుగా మారతారన్నారు. కేసీఆర్ దళితుల పాలిట దైవం అని, “దళితబంధు” పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేవుడిలా భావించి పూజలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.