నమస్తేతెలంగాణ నెట్వర్క్: దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేదుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి విడతలో ఎంపికైన లబ్ధిదారులందరికీ ఒక్కో యూనిట్కు రూ.10 లక్షల చొప్పున నిధులు విడుదల చేసి వారిని ఆర్థికాభివృద్ధి వైపు నడిపించింది. రెండో విడతలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి.. సగం మందికి నిధులు కూడా విడుదల చేసింది. ఇంతలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చి పథకం అమలు ప్రక్రియకు బ్రేకులు వేసింది.
దీంతో లబ్ధిదారులంద రూ.. ఎన్నికలయ్యాక.. కొత్త ప్రభుత్వం వచ్చి తమకు నిధులు విడుదల చేస్తుందని ఆశగా ఎదురుచూశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వ చ్చి నెల రోజులు గడుస్తున్నా.. దళితబంధు గురించి పట్టించుకోవడం లేదని నిరాశ చెందుతున్నారు. గ్రౌం డింగ్ చేసిన యూనిట్లకైనా నిధులు విడుదల చేయడం లేదని వాపోతున్నారు. పైగా.. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో.. ఇంతకు దళితబంధు ఉంటుందా? ఊడుతుందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లికి చెందిన లబ్ధిదారు ఓరుగంటి కవిత మాట్లాడుతూ.. ఆరు నెలల కింద తన భర్త ఓరుగంటి సమ్మయ్య పేరు మీద దళితబంధు వ చ్చిందని, మొదట రూ.5 లక్షలు ఇస్తే కిరాణా షాపు పెట్టుకున్నామని తెలిపింది. ఎన్నికల కోడ్ వల్ల పెండింగ్లో ఉన్న రూ.5 లక్షలు ఇవ్వలేదని పేర్కొన్నది.
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్వాసి పొట్ట ముత్యాలి మాట్లాడుతూ.. ‘నా భర్త మేస్త్రీ పనిచేస్తున్నాడు. నేను ఇండ్లలో పని చేస్తున్న. దళితబంధుకు నన్ను ఎంపిక చేయడంతో మా కష్టాలన్నీ తీరిపోతయని సంతోషపడినం. దుకాణం పెట్టుకుని జీవితానికి కొత్త బాటలు వేసుకోవాలనుకున్నం. అధికారులు చెప్తే అకౌంట్ కూడా తీసిన. నేడో, రేపో అకౌంట్లో డబ్బులు పడుతయని అనుకుంటే ఖాతా ఫ్రీజ్ అయినట్టు చెప్తున్నరు’ అని వాపోయింది.
దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వం అమలు చేసిన విధంగానే ఈ ప్రభుత్వం కూ డా దళితబంధు పథకాన్ని అ ర్హులైన ప్రతి దళితుడికి అం దించాలి. రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారుల కోసం అప్పటి ప్రభుత్వం నిధులను సైతం కేటాయించింది. జిల్లాలోని 1,100 మంది లబ్ధిరులకు గ్రౌండింగ్ చేసి వారు ఎన్నుకున్న యూనిట్లను అందజేయాలి. ఇప్పటికే పథకం కోసం పలువురు అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందించాం. కొత్త ప్రభుత్వం అర్హులైన దళితులకు న్యాయం చేయాలి.
– కోగిల మహేశ్, దళిత సంఘం నాయకుడు, ములుగు