హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 6ఇ -25 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమ బంగారం గుర్తించారు. అతని వద్ద లభించిన 18 క్యారెట్ల 381 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 13.6 లక్షలు ఉంటుందని తెలిపారు. అతనిపై బంగారం అక్రమ రవాణా కేసు నమోదు చేశారు. సూట్కేస్ లోపల ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్లో బంగారాన్ని దాచాడని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..