శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 3: శంషాబాద్ ఎయిర్పోర్టులో మార్చి నెలలో కస్టమ్స్ అధికారులు 12 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. 27 కేసులు నమోదు చేశారు. ఈ వివరాలను కస్టమ్స్ అధికారులు బుధవారం ఎక్స్లో ప్రకటించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు దుబాయ్, బ్యాంకాక్, సౌదీఅరేబియా.. తదితర దేశాల నుంచి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా అక్రమంగా మార్చి నెలలో తీసుకొచ్చిన 12 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప్రయాణికులు బంగారాన్ని పేస్టు రూపంలో, సామగ్రిలో, చెప్పుల్లో దాచి తీసుకొచ్చారని, నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. నిరుడు 2023-24లో మొత్తం 247 కేసుల నమోదుతోపాటు 132 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.