హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన నలుగురు ప్రధాన నిందితుల కస్టడీ మంగళవారంతో పూర్తయ్యింది. మరోపక్క లీకైన గ్రూప్-1 పేపర్తో పరీక్ష రాసి అత్యధిక మార్కులు తెచ్చుకున్న సురేశ్, రమేశ్, షమీమ్ను బుధవారం సిట్ కస్టడీలోకి తీసుకోనున్నది. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడంతో వీళ్ల నెట్వర్క్ను సిట్ వెలుగులోకి తేనున్నది. ఏఈ పరీక్ష పత్రం లీకేజీతో మొదలైన సిట్ దర్యాప్తు, గ్రూప్-1 పేపర్ లీకేజీని కూడా గుర్తించింది. ఈ లీకేజీ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేసింది.
ప్రధాన నిందితులైన ప్రవీణ్కుమార్, రాజశేఖర్రెడ్డి, రేణుక, ఆమె భర్త ఢాక్యానాయక్, ఆమె సోదరుడు రాజేశ్వర్ను రెండోసారి మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్న సిట్.. ఏఈ ప్రశ్నపత్రం లీకేజీపై కీలకమైన సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. రేణుక భర్త ఢాక్య ఏఈ పేపర్లు అమ్మినట్టు విచారణలో వెల్లడి కావడంతో ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్యను అరెస్టు చేశారు. ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారమంతా పాత మహబూబ్నగర్ జిల్లా గండేడ్ పరిసర ప్రాంతాల్లో జరిగినట్టు సిట్ అధికారులు గుర్తించారు.