హైదరాబాద్ : రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశం కానున్నారు. రాష్ర్టంలో కరోనా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఈ నెల 6వ తేదీన సీఎస్ సోమేశ్ కుమార్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విదితమే.
తాజాగా రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చేరాయి. ఇందులో 1788 మంది బాధితులు వైరస్వల్ల మరణించగా, మరో 3,08,396 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 27,861 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 18,685 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 446, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 314, నిజామాబాద్లో 279 చొప్పున ఉన్నాయి.
ఇవికూడా చదవండి..