Heavy Rains | హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్తింది. ఈ నేపథ్యంలో వదర బాధిత జిల్లాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti kumari) ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్లను నియమించారు. ములుగు జిల్లా ప్రత్యేకాధికారిగా కృష్ణ ఆదిత్య, భూపాలపల్లి జిల్లాకు పీ.గౌతమ్, నిర్మల్ జిల్లాకు ముషారఫ్ అలీ, మంచిర్యాల జిల్లా ప్రత్యేక అధికారిగా భారతి హోళికేరిని నియమించారు.