సిద్దిపేట/చేర్యాల : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 10 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.
భక్తులు శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవం మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తల తీసుకుంది.
ఇవి కూడా చదవండి..
Crime news | గద్వాలలో ఆర్ధరాత్రి దొంగల హల్చల్
Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
Road accident | బైక్ను ఢీ కొట్టిన బస్సు..ఇద్దరి దుర్మరణం