యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం సెలవుదినం కావడంతో యాదాద్రికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి మొక్కులు తీర్చుకోవడానికి బారులు తీరారు.
స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. తిరు మాడ వీధుల్లో భక్తులతో నిండి పోయింది. స్వామి వారి దర్శనం అనంతరం ప్రసాదం కొనుగోలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు.