హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై (KTR) బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత హనుమకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన హనుమకొండ పోలీసులు ఆ కేసును బంజారాహిల్స్ పీఎస్కు బదిలీ చేశారు. దీంతో కేటీఆర్పై ఐపీసీ 504, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.
సీఎం రేవంత్రెడ్డి 2,500 కోట్లు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద వసూలు చేసి ఢిల్లీకి పంపించారని కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్తాడని అబద్ధాలు చెప్పి సీఎం స్థాయి ని తగ్గించేలా మాట్లాడారని, తద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. కేటీఆర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.