యాదాద్రి భువనగిరి : కేసుల పురోగతితో పాటు నేర రహిత గ్రామాలుగా మార్చడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాక్సిడెంట్స్, హత్యలు, అనుమానాస్పద కేసులలో సీసీ కెమెరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమన్నారు. వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
షాకింగ్ : స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్లో అశ్లీల చిత్రాలు