మాడ్గులపల్లి, మార్చి 14 : దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్రాన్ని ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితపై ఢిల్లీ మద్యం కేసు బనాయించి ఈడీని ఉసిగొల్పిందని దుయ్యబట్టారు.